అలీఘడ్ యూనివర్సిటీలో ఉద్రిక్త
ఉత్తరప్రదేశ్ : రాష్ట్రంలోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. గత అర్థరాత్రి ఓ ఎస్ఎంఎస్ విషయంలో విద్యార్థుల మధ్య చెలరేగిన గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు పరస్పరం కత్తులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఒక విద్యార్థి మృతి చెందాడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు విద్యార్థులు వాహనాలకు నిప్పుపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి… గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.