అసోంను ముంచెత్తిన వర్షాలు-12మంది మృతి

భారీ వర్షాలు అసోంలోని అనేక ప్రాంతాలను ముంచెత్తాయి. లోతట్టు గ్రామాల్నీ నీట మునిగాయి. వరదలు ముంచెత్తడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద బీభత్సానికి ఇప్పటి వరకు 12 మంది చనిపోయారు. భారీ వర్షాలతో దాదాపు 20 లక్షల మంది నిరాశ్రయలయ్యారు. సాయం కోసం ఎదురు చూస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు అధికారులు ముమ్మరంగా సహాక చర్యలు చేపట్టారు.