అసోంలో ప్రమాదం: పడవ మునిగిపోయింది.

q085ps5sఅసోంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కామ్ రూప్ జిల్లాలోని కలహి నదిలో ప్రమాదవశాత్తు ఓ పడవ మునిగిపోయింది. ప్రమాదంలో 50 మంది మృతిచెందారు. మరికొందరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీమ్స్ గాలిస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 200 మందికి పైగా ప్రయాణికు ఉన్నట్లు అధికారులు తెలిపారు.చాయగావ్ నుంచి కామ్ రూప్ కు పలువురు పడవ పోటీలు చూసేందుకు వెళ్తుండగా బోటు ఇంజన్లో సమస్య తలెత్తి ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదంలో కొందరు చనిపోగా.. కొందరు కొట్టుకుపోయారని, మరికొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారని చెప్పారు. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామన్నారు.