అసోంలో వరద బీభత్సం

h44e2pd6అసోంలో వరద బీభత్సం కొనసాగుతోంది. వారం రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలతో బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మొత్తం 19 జిల్లాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. సుమారు 6 లక్షల 50 వేల మంది నిరాశ్రయులయ్యారు. 57 వేల 500 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. అటు వరదలవల్ల జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 12 మంది మృతిచెందారు.