ఆంజనేయ స్వామిని దర్శించుకున్న చీఫ్ ఇంజినీర్
శివంపేట్: శివంపేట్ మండలం చిన్నగొట్టి ముక్కలలోని చారరమిట్ట సహకార ఆంజనేయ స్వామి దేవాలయంలో పంచాయతీరాజ్, నాబార్డ్ చీఫ్ ఇంజినీర్ పద్మజ గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో రూ. 183 కోట్లతో రోడ్ల పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఆమె వెంట జిల్లా పంచాయితీరాజ్ ఎన్ఈ వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.