ఆగని అత్యాచారాల కాండ

బాలికను కిడ్నాప్‌ చేసి ఇద్దరు యువకుల అత్యాచారం

యూపిలో మరో ఘటన

లక్నో,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): వరుస అత్యాచారాలతో దేశం అట్టుడుకుతన్నా అవి ఆగడం లేదు. తాజాగా యుపిలోని ముజఫర్‌నగర్‌ జిల్లా సంబలేరా గ్రామంలో ఓ మైనర్‌ బాలికపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. బాధిత బాలికను వారు కిడ్నాప్‌ చేసి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆదివారం జరిగిందని పోలీసులు తెలిపారు. బాధిత బాలిక వస్తువులు కొనుక్కునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆ బాలికను ఇద్దరు యువకులు కిడ్నాప్‌ చేసి సవిూప ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఇంటికి వచ్చిన బాలిక జరిగిన ఘటనను తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.