ఆగ్రహం వ్యక్తం చేసిన మోదీ

 modi-us-visit-759పెద్ద నోట్ల రద్దును వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నోట్ల రద్దుకు సంబంధించి పలు అంశాలపై ఎంపీలకు మోదీ దిశానిర్దేశం చేశారు. డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కాంగ్రెస్, తృణమూల్ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. సభలో విపక్షాలకు దీటుగా వ్యవహరించాలని నిర్ణయించారు. డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పించే బాధ్యత ప్రతిపక్షాలకు ఉందన్నారు. చర్చకు విపక్షాలు ముందుకు రావట్లేదని మోదీ అన్నారు. చర్చకు సిద్ధమంటూనే జరగనీయకుండా విపక్షాలు తప్పుదారి పట్టిస్తున్నారని మోదీ ఆగ్రహం వెలిబుచ్చారు.