ఆటోడ్రైవర్లకు అవగాహన కార్యక్రమం
కాగజ్నగర్: పట్టణంలోని ఆటోడ్రైవర్లకు ‘మీకోసం పోలీసులు’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమాలపై పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సురేశ్బాబు మాట్లాడుతూ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.