ఆటో ఢీకొన్ని రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

చింతకాని: పందిళ్లపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో ద్విచక్రవాహనం, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.