ఆత్మగౌరవమంటే అధికారమే: యార్లగడ్డ
న్యూఢిల్లీ,నవంబర్1(జనంసాక్షి): ఆత్మగౌరవ నినాదానికి అర్థం మారిపోయిందని పార్లమెంటు మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు అధికరామే ఆత్మగౌరవమన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతిలో శంకుస్థాపన శిలాఫలకాన్ని ఇంగ్లీషులో వేసుకున్నప్పుడే తెలుగువారి ఆత్మగౌరవం పోయిందని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత కాలంలో ఆత్మగౌరవం అంటే అర్థం మారిపోయిందన్నారు. ‘కాంగ్రెస్ వాళ్లు విూ పక్కన కూర్చుంటే లేచి వెళ్లిపోండి’ అని అప్పట్లో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ చెప్పేవారని వెల్లడించారు. ఢిల్లీలో ఆయన విూడియాతో మాట్లాడారు. ఇప్పుడు నేతలకు ఆత్మగౌరవం అంటే అధికారమేనని, అందుకోసమే వాళ్లు పాకులాడుతున్నారని దుయ్యబట్టారు.