ఆధ్యాత్మిక జీవనానికి అయ్యప్ప స్వామి మాలధారణ వరం

హరిహరసుతుడు అయ్యప్ప స్వామి దీవెనలతో దీక్షలు విజయవంతం కావాలి; ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
కోదాడ టౌన్ నవంబర్ 25 ( జనంసాక్షి )
ఆధ్యాత్మిక జీవనానికి అయ్యప్ప స్వామి మాలధారణ వరం లాంటిదని కోదాడ అభివృద్ధి ప్రధాత, శాసన
సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి  దేవాలయంలో  ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్  ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మర్ల వీరబాబు, పెద్ద బాబుల ఇరుముడి మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అయ్యప్ప మాల ఆధారణతో ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అన్నారు.ఆధ్యాత్మిక సేవలో ఉండడంతో నైతిక విలువలతో పాటు సమాజ శ్రేయస్సు పెరుగుతుందన్నారు.అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మలధారుణుల దీక్షలు విజయవంతం కావాలన్నారు. లోక కళ్యాణం కోసం   హరిహరసుతుడు అయ్యప్ప స్వామి కఠినమైన దీక్షలు చేశారని చెప్పారు.నిత్య పూజలతో,మిత ఆహారంతో, కఠినమైన దీక్షలు చేయాలని కోరారు. స్వాములకు అన్నదానాలు చేయడం పుణ్యకార్యం అన్నారు.అనంతరం దేవాలయ కమిటీ వారు ఎమ్మెల్యే గారిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవిత రాదా రెడ్డి,సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్  కొండ సైదయ్య,టిఆర్ఎస్ నాయకులు ఒంటిపులి శ్రీనివాస్,బత్తుల ఉపేందర్, గన్నా అశోక్, స్వాములు,తదితరులు పాల్గొన్నారు.