ఆపద్బాంధవుడు పైలెట్ రోహిత్ రెడ్డి

ఆపద్బాంధవుడు పైలెట్ రోహిత్ రెడ్డి

తాండూరు అక్టోబర్ 13 (జనం సాక్షి) అధైర్య పడకు అండగా ఉంటానని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మహేష్ కు మనోధైర్యాన్ని కల్పించారు.పెద్దేముల్ మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన యువనాయకుడు మహేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి తాండూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి శుక్రవారం
ఆసుపత్రికి వెళ్లి మహేష్ ని పరామర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దిగులు చెందకు మహేష్ నేనున్నాను చికిత్స కోసం ఆస్పత్రికి అయ్యే ఖర్చులు భరిస్తానని చికిత్స పొందుతున్న మహేష్ కు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తం రావు, శ్రీశైలం రెడ్డి తదితరులు ఉన్నారు