ఆపరేషన్‌ థియేటర్‌లో వైద్యుల గొడవ

 

నిర్లక్ష్యానికి పసికందు మృతి

జయపుర,ఆగస్ట్‌30 : ఆపరేషన్‌ థియేటర్‌లో వైద్యుల మధ్య వివాదం ఓ పసికందు ప్రాణం తసీఇంది. గర్భిణీకి సర్జరీ చేస్తూ ఇద్దరు వైద్యులు ఒకర్నొకరు తిట్టుకున్నారు. ఫలితంగా.. ఆ పసిబిడ్డ పుట్టీపుట్టగానే కన్నుమూసింది. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.జోధ్‌పూర్‌లోని స్థానిక ఉమైద్‌ హాస్పిటల్‌లో మంగళవారం ఓ గర్భిణీ డెలివరీకి వచ్చింది. అప్పటికే బిడ్డ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న సర్జన్లు అశోక్‌, తక్‌.. ఆమెకి సర్జరీ చేయాలనుకున్నారు. అన్ని సిద్ధం చేసి ఆమెను ఆపరేషన్‌ థియేటర్‌కి తరలించారు. ఈ నేపథ్యంలో ఆమె ఉదయం ఏం ఆహారం తీసుకుందన్న విషయమై ఇద్దరు వైద్యుల మధ్య గొడవ మొదలైంది. సర్జరీ చేస్తూ ఒకర్నొకరు బెదిరించుకున్నారు. అక్కడే ఉన్న మరో ఇద్దరు వైద్యులు వారికి సర్దిచెప్పడానికి యత్నించారు. అయినా వారు వినిపించుకోలేదు. ఇద్దరూ గొడవపడుతూ.. ఆఖరికి ఆ తల్లికి కడుపుకోత మిగిల్చారు. బిడ్డ పుట్టగానే కొద్దిసేపటికే చనిపోయింది. దృశ్యాన్ని ఆపరేషన్‌ థియేటర్‌లో ఉన్న ఓ నర్సు చిత్రించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో యాజమాన్యం వెంటనే ఇద్దరు వైద్యులను విధుల నుంచి తొలగించింది. దీనిపఐ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనతో నిరసనలు వ్యక్తం కావడంతో తగుచర్యలు తీసుకుంటామని అధికారులు హావిూఇచ్చారు.