ఆమెజాన్‌తో తెలంగాణ సర్కార్‌ ఒప్పందం

2

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి):

తెలంగాణలో అమెజాన్‌ సంస్థ అతిపెద్ద గిడ్డంగిని నిర్మించాలనుకోవడం సంతోషకరంగా ఉందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ నూతన పారిశ్రామిక బిల్లును అసెంబ్లీలో పాస్‌ చేశామని గుర్తు చేశారు. నూతన పారిశ్రామిక విధానంలో రాష్ట్రంలో కంపెనీలు భారీగా ఏర్పాటు అవుతున్నాయని సీఎం తెలిపారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరులో 2 లక్షల 80 వేల స్కేర్‌ ఫీట్లలో అమెజాన్‌ సంస్థ వేర్‌హౌస్‌ను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిఎం కెసిఆర్‌, మంత్రి కేటీఆర్‌ను  అమెజాన్‌ సంస్థ ప్రతినిధులు డు సచివాలయంలో  కలిశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరులో వేర్‌హౌస్‌ నిర్మాణానికి అమెజాన్‌ సంస్థ, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.