ఆమ్‌ఆద్మీని అంతమొందించేందుకు మీడియా సుపారీ

3

– కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ,మే 4 (జనంసాక్షి):

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ విూడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీని ఖతం చేసేందుకు విూడియా సుపారీ తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. విూడియా సంస్థలపై బహిరంగ విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆప్‌ ప్రభుత్వంలో న్యాయశాఖమంత్రిగా ఉన్న జితేంద్ర తోమర్‌ నకిలీ డిగ్రీల విషయంపై విూడియా వ్యవహరించిన తీరును ఆయన దుయ్యబట్టారు. అలాగే ఆప్‌ ర్యాలీ సందర్భంగా రైతు ఆత్మహత్యను సైతం విూడియా ఛానెళ్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రతిష్ఠను దిగజార్చేలా ప్రసారం చేసిన వైనాన్ని ఆయన విమర్శించారు. తోమార్‌ విషయంలో వాస్తవాలు తెలుసుకోవడం విూడియా ఉద్దేశం కాదని, ఆయనను పదవి నుంచి తొలగించడం వారు కోరుకుంటున్నారని కేజీవ్రాల్‌ అన్నారు. తోమార్‌ తనకు బంధువు కాదని, వివాదంపై ఆయన తనకు సంతృప్తికరమైన సమాధానం ఇచ్చారని కేజీవ్రాల్‌ తెలిపారు. ఇలాంటి విషయాలు చూశాక విూడియాతీరు అనుమానాస్పదంగా ఉందన్నారు