ఆయన సేవలు అపూర్వం

హైదరాబాద్‌, నవంబర్‌ 2 ;

తెలుగుదేశంపార్టీ సీనియర్‌ నాయకుడు కె. ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా దురదృష్టకరమని ఆ పార్టీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని యనమల శుక్రవారంనాడు ఒక ప్రకటనలో అన్నారు. ఇలాంటి దుర్వార్త వినడం చాలా బాధాకరం. కె. ఎర్రంన్నాయుడు అకాల మరణం జీర్ణించుకోలేకపోతున్నాం. తెలుగుదేశం నేతలే కాదు…. ఆయన మిత్రులు, బంధువులు, అభిమానులు ఆయన మరణ వార్త విన్న వెంటనే దఃఖ సాగరంలో మునిగిపోయారన్నారు. రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి రూ. 4000 కోట్లు అదనంగా తెచ్చి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో ప్రత్యేక భూమికను పోషించిన మంచి మిత్రుడని అన్నారు.