ఆరోరోజూ తగ్గిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ,అక్టోబర్23(జనంసాక్షి): వరుసగా ఆరో రోజు కూడా చమురు ధరలు తగ్గాయి… పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఆరో రోజు కూడా తగ్గడంతో… ఈ ఆరు రోజుల్లో లీటర్ పెట్రోల్పై రూ.1.49 మేర, లీటర్ డీజిల్పై 84 పైసలు తగ్గింది. మంగళవారం లీటర్ పెట్రోల్పై 10 పైసలు తగ్గించడంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల ధర రూ. 81.34కు చేరుకోగా… ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల ధర రూ. 86.81కు చేరింది. ఇక లీటర్ డీజిల్పై 7 పైసలు తగ్గించడంతో దేశరాధానిలో లీటర్ డీజిల్ ధర రూ.74.85కు చేరగా… ముంబైలో లీటర్ డీజిల్ ధర రూ. 78.46కు చేరుకుంది. ఇక చెన్నైలో పెట్రోల్ ధర లీటరుకు 11 పైసలు తగ్గి రూ. 84.53గా పలుకుతుండగా… డీజిల్ ధర 7 పైసలు తగ్గి రూ. 79.15కు చేరిది.