ఆర్టీసీ ఉద్యోగులకు వైద్య పరీక్షలు

టీఎస్ ఆర్టీసీ సూర్యాపేట డిపో ఉద్యోగులకు ఆర్టీసీ తార్నాక ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం  వైద్య పరీక్షలు నిర్వహించారు.రక్త , కంటి పరీక్షలు, బిపి, ఈసిజితో పాటు   పలు రకాల వైద్య పరీక్షలు చేశారు.అనంతరం మధు గురూజి ఆధ్వర్యంలో యోగపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా డివియం జీసీ కేశవులు మాట్లాడుతూ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ఆదేశాల మేరకు ఆర్టీసీ తార్నాక ఆసుపత్రి , నల్గొండ డిస్పెన్సరీ ఆధ్వర్యంలో ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.అవసరమైన వారికి చికిత్సలు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శివశంకర్, డాక్టర్ దిగంబర్ , డాక్టర్ రాజు, అసిస్టెంట్ మేనేజర్ వెంకటమ్మ , ఇస్రత్ తదితరులు పాల్గొన్నారు.