ఆర్టీసీ చర్చలు విఫలం

హైదరాబాద్‌ : తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ యాజమాన్యంతో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 17న మరోసారి చర్చలు జరపాలని సంఘం నేతలు నిర్ణయించారు. తమ 36 డిమాండ్లలో ఏ ఒక్క దానిపైన యాజమాన్యం స్పష్టమైన హమీ ఇవ్వలేదని ఎస్‌ఎంయూ నేత మహమూద్‌ తెలియజేశారు. ఈ నెల 20లోపు హమీ రాకపోతే రాష్ట్రవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.