ఆర్థిక అక్షరాస్యత నగదు రహిత లావాదేవీలపై అవగాహన సదస్సు

మక్తల్ సెప్టెంబర్ 24 (జనంసాక్షి) నాబార్డ్ డిసిసిబి బ్యాంక్ ఆధ్వర్యంలో సహకార సంఘాల ద్వారా రైతులకు రుణాలు అందిస్తున్నామని నాబార్డ్ Flc వెంకటేష్ గారు తెలిపారు. శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మక్తల్ నందు నిర్వహించిన రైతులకు ఆర్దిక అక్షరాస్యత నగదు రహిత లావాదేవీల పై అవగాహన కల్పించారు రైతులు తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలపై సకాలంలో వడ్డీ చెల్లిస్తూ దీర్ఘకాల రుణాల పాత బకాయిలు చెల్లించి సంఘం అభివృద్ధికి తోడ్పడాలని కోరారు ఈ కార్యక్రమంలో డిసిసిబి మక్తల్ బ్రాంచ్ మేనేజర్ శ్రీ వెంకటరమణ చారి పిఎసిఎస్ సీఈవో రాములు డైరెక్టర్లు జి వెంకటప్ప, మహదేవప్ప, మహదేవమ్మా అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు