భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి శోభాయాత్ర
ఊర్కొండ ఏప్రిల్ 02, ( జనం సాక్షి ) ;మండలంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన ఊరుకొండపేట అంజన్న శోభాయాత్ర (హనుమాన్ శోభాయాత్ర) అత్యంత వైభవంగా ప్రారంభించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అబ్దుల్ రషీద్, ఆలయ ఈవో సత్య చంద్రారెడ్డి జెండా ఊపి స్వామి వారి శోభాయాత్ర ప్రారంభించారు. కాషాయ వస్త్రాలతో భక్తులు, జై హనుమాన్ నినాదాలతో మారుమోగాయి.
ఆటపాటలతో జైశ్రీరామ్.. జై హనుమాన్ నినాదాలతో పురవీధులలో భక్తి శ్రద్ధలతో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. హనుమాన్ మాల ధరించిన స్వామి భక్తులు శోభాయాత్రలో ఆట, పాటలతో నృత్యాలు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, దత్తాత్రేయ శర్మ, మాజీ ఆలయ ఛైర్మెన్, పాలక మండలి సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.


