ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీతో సీఎం కేసీఆర్ భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీతో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు భేటీ అయ్యారు. ఇవాళ ఆయన జైట్లీని కలిసి రాష్ట్రంలోని సమస్యలను వివరించి, సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరినట్టు సమాచారం. ఈమేరకు వినతి పత్రం అందజేశారు. కాగా, కాసేపటి క్రితం ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. జైట్లీని కలిసిన వారిలో సీఎం కేసీఆర్ తోపాటు ఎంపీ జితేందర్ రెడ్డి కూడా ఉన్నారు.