ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది కాంగ్రెస్సే

hs5ez1jiకేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో అనుసరించిన విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా మారిందని ఆయన చెప్పారు. ఇందిరా గాంధీ 98వ జయంతి సందర్భంగా ఢిల్లీలో యూత్‌ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విపక్షాల పట్ల ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాన్ని కూడా ఆయన విమర్శించారు. వాజ్ పేయి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఇందిరాగాంధీని దుర్గామాతగా పార్లమెంటులో ఆయన అభివర్ణించారని మన్మోహన్ గుర్తు చేశారు. ఆమె దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు.