ఆర్థిక సహాయం అందజేసిన ఆరాధ్య ఫౌండేషన్ ఛైర్మన్ తాడోజు శ్రీకాంత రాజు

మోత్కూరు అక్టోబర్ 8 జనంసాక్షి : మోత్కూర్ లో రిక్షా కార్మికుడు బొమ్మగాని నర్సింహా మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి రూ.5000 ఆర్ధిక సహాయం అందించారు. అదే విధంగా మండలంలోని దాచారం గ్రామానికి చెందిన సురారం నర్సింహ అకాల మరణం చెందగా శనివారం దాచారం గ్రామంలో మృతదేహం పై పూలమాల వేసి శ్రదంజలి ఘటించిన ఆరాధ్య ఫౌండేషన్ ఛైర్మన్ తాడోజు శ్రీకాంత రాజు. అనంతరం మృతుని కుటుంబం సభ్యులను పపరామర్శించి రూ.5000 ఆర్థిక సహాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు గనగాని నర్సింహా, ధబ్బేటి సోంబాబు, బుర్ర శ్రీనివాస్,కాపర్తి సైమన్ లు పాల్గొన్నారు.