ఆర్మీ మాజీ చీఫ్ కేవీ కృష్ణారావు కన్నుమూత

న్యూ ఢిల్లీ: భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ కేవీ కృష్ణారావు(93) శనివారం కన్నుమూశారు. గతంలో జమ్మూకశ్మీర్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర రాష్ట్రాలకు గవర్నర్గా ఆయన పనిచేశారు. కృష్ణారావు 1923లో విజయవాడలో జన్మించారు. 1942లో భారత సైన్యంలో చేరిన ఆయన యువ ఆఫీసర్గా బర్మాలో, రెండవ ప్రపంచయుద్ధ కాలంలో బెలుచిస్తాన్లో సేవలందించారు.

భారత ఆర్మీకి 14 వ ఛీఫ్గా కృష్ణారావు పనిచేశారు. భద్రతా అంశాలపై ‘ప్రిపేర్ ఆర్ పెరిష్’, ఆర్మీలో తన సేవలను గుర్తు చేసుకుంటూ ‘ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద నేషన్’ అనే పుస్తకాలను ఆయన రాశారు. కృష్ణారావు అందించిన సేవలకు గాను పరమ్ విశిష్ఠ్ సేవా మెడల్తో  సత్కరించబడ్డారు.