ఆర్టీసీ సమ్మె న్యాయమైనది
– సమ్మెకు పూర్తి మద్ధతు
– టీజేఏసీ చైర్మన్ కోదండరామ్
హైదరాబాద్ మే7(జనంసాక్షి):
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవని వారి సమ్మెకు పూర్తి మద్దతిస్తున్నట్లు తెలంగాణ ఐకాస చైర్మన్ ప్రొ. కోదండరాం స్పష్టం చేశారు. అనివార్య పరిస్థితుల్లోనే ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లారని ఆయన అభిప్రాయపడ్డారు. కార్మికుల సమ్మెపై ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠకు పోయి శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపి ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడొద్దన్నారు. అలాగే డిమాండ్లన్ని రాజ్యంగ బద్దమైనవని వాటిని ముందే ప్రభుత్వం పరిష్కరించి ఉండాల్సిందని, సమ్మెలోకి వెళ్ళిన తరువాత కాలయాపన చేయడం సరికాదన్నారు. చర్చలతో సమస్య పరిష్కరించేలా యాజమాన్యంపై ఒత్తిడితెస్తామని కోదండరాం అన్నారు.