ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి ఎంపీ సుఖేందర్‌రెడ్డి

చింతపల్లి: మండలంలోని వెంకటేశ్వరనగర్‌లోని వెంకటేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. బ్రహోత్సవాల్లో భాగంగా ఆయన సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తెదేపా జిల్లా నాయకుడు కేతావత్‌ బిల్యానాయక్‌, దేవరకొండ , ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు నేనావత్‌ బాలు నాయక్‌, మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు స్వామి వారిని దర్శించుకున్నారు.