ఆశ్రమం నిర్మాణం కోసం తన వంతు కృషి.

ఆశ్రమం నిర్మాణం కోసం తన వంతు కృషి.

తాండూరు అక్టోబర్ 9( జనం సాక్షి)ఆమనగల్ పీఠాధిపతి శ్రీ శ్రీ శివానంద స్వామి ఆమనగల్ లో కొత్త ఆశ్రమం నిర్మించబడుతుంది కావున ఆశ్రమ నిర్మాణము విరాళం కొరకు సోమవారం మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా తన నివాసంలో కలిసి శాలువాకులమ్మలతో ఘనంగా సన్మానించి ఆశీర్వదించారు.ఈ సందర్భంగా గనులు భూగర్భ సమాచార శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆశ్రమం నిర్మాణం కోసం తమ వంతు సహాయ సహకారం తప్పక అందజేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా గీతా సత్సంగ్ సేవ సమితి తాండూర్ సభ్యులు కలిసి మంత్రి మహేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, గీత సత్సంగ్ సమితి సభ్యులు తదితరులు ఉన్నారు.