ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీ

చౌడాపూర్,అక్టోబర్ 1( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్ర పరిధిలోని కన్మాన్ కాల్వ గ్రామంలో ఆసరా పెన్షన్ కార్డులను గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మాట్లాడుతూ 57 సంవత్సరాల వయస్సు నిండిన వ్యక్తులకు సీఎం కేసీఆర్ ఆసరా పథకం ద్వారా రూ.2016 లును అందించి వారికి ఆసరాగా నిలుస్తున్నాడని సీఎం కేసీఆర్ ను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిచంద్ర,జెడ్పిటిసి రాందాస్ నాయక్,మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి,  అదేవిధంగా వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు మరియు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.