ఇంజిన్‌ నుంచి విడిపోయిన బోగీలు

బహ్రైచ్‌ : ఉత్తర ప్రదేశలోని బహ్రైచ్‌ స్టేషను సమీపంలో మెయిలని – గొండ ప్యాసింజెర్‌ రైలు ఇంజిన్‌ నుంచి ఏడు బోగీలు విడిపోయాయి. ఇంజిన్‌… బహ్రైచ్‌ స్టేషనకు చేరాక గాని విడిపోయిన బోగీల సంగతి డ్రైవర్‌కు తెలియలేదు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే విడిపోయిన బోగీలను ఇంజిన్‌కు అనుసంధానించారు. ఈ ఘటనతో ఇక్కడ రైలు రాకపోకలను అంతరాయం కలిగింది. రెండు బోగీల మధ్య కప్లింగ్‌ విరిగిపోవడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ బోగీల్లో దాదాపు 750 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం ఈ ఘటనపై విచారణకు రైల్వే ఒక కమిటీని నియమించింది.