*ఇంటర్ ఫలితాలలో మెరిసిన “పినాకిల్ స్కూల్ విద్యార్థి సిరికొండ అఖిల”*

నేరేడుచర్ల( జనంసాక్షి) న్యూస్.మండలంలో కల్లూరు గ్రామానికి చెందిన సిరికొండ అఖిల ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలను 984/1000 సాధించింది.కల్లూరు గ్రామానికి చెందిన సిరికొండ ముక్కంటి,సిరికొండ లింగమ్మ ల పుత్రిక అఖిల హైదరాబాద్ నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది.మంగళవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలలో 984/1000 మార్కులు సాధించి సత్తా చాటింది. సిరికొండ అఖిల పదవతరగతి విద్యాభ్యాసం నేరేడుచర్ల “పినాకిల్” స్కూల్లో విద్యను అభ్యసించింది. అత్యుత్తమ ఫలితాలు సాధించిన అఖిల ను తల్లిదండ్రులతో పాటు పినాకిల్ స్కూల్ ప్రిన్సిపాల్ మదార్, స్కూల్ టీచర్స్ మరియు కల్లూరు గ్రామ ప్రజలు అభినందించారు.