ఇంట్లో చోరీ: 38 తులాల బంగారం మాయం
వేపగుంట, విశాఖ : విశాఖ సిటీలోని జీవీఎంసీ 72వ వార్డు సింహపురి లేఅవుట్లో గల మహలక్ష్మి రెసిడెన్సీలో మంగళవారం రాత్రి చోరి జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు పగలగొట్టి దొంగలు ప్రవేశించి 38 తులాల బంగారం, 6 వేల నగదు దొంగిలించారు. బాధితుడు తారణానందం డాక్ యార్డ్లో రిటైర్డ్ ఫోర్మన్. అదే భవనంలో తమకున్న మరో అపార్డుమెంట్లో ఈ కుంటుమంతా నిద్రిస్తుండగా ఈ దొంగతనం జరిగింది, ఏసీపీ ప్రసాద్, క్రైమ్ ఎన్ఐ ప్రసాదరావు, క్లూన్టీమ్ సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.