ఇకపై పాటలు వింటూ రైలు ప్రయాణం

న్యూఢిల్లీ: ఇకపై ఎఫ్‌ఎం రేడియోలో పాటలు, సంగీతం వింటూ రైలులో ప్రయాణించవచ్చు. త్వరలో రైళ్లలో ‘రైల్ రేడియో’ పేరుతో పాపులర్ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లను రైళ్ల శాఖ ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది.

ప్రయాణికులు పాటలు, సంగీతాన్ని వినడంతో పాటు విపత్కర పరిస్థితులు, అత్యవసర సమయాల్లో వారికి వివరాలు తెలియజేసేందుకు ఇది ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. తొలి దశలో మెయిల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ కలిపి వెయ్యి రైళ్లలో ఈ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు.