ఇటలీ నావికాధికారుల కేసులో నేడు ఎఫ్ఐఆర్
న్యూఢీల్లీ : భారత జాలర్లను ఇద్దరు ఇటలీ నావికాధికారులు కాల్చివేసిన ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగుతోంది. నేడు ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయనున్నారు. ఈ కేసు విచారణను కేంద్రం ఎన్ఐఏకు అప్పగించిన విషయం తెలిసిందే.