ఇటలీ నావికుల కేసు ఎన్‌ఐఏకు అప్పగింత

న్యూఢిల్లీ: భారత ప్రాదేశిక జలాల్లో ఇద్దరు భారతీయ జాలర్లను కాల్చి చంపారనే ఆరోపణలు ఎదుర్కోంటున్న ఇద్దరు ఇటలీ నావికుల కేసును ఎన్‌ఐఏకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటలీ నావికుల కేసును విచారించే హక్కు కేరళ కోర్టులకు లేదవి గతంలో సుప్రీం చసిన వ్యాఖ్యల నేపధ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.