ఇటలీ రాయబారిపై సుప్రీం ఆంక్షలు ఎత్తివేత

న్యూఢిల్లీ : భారత ప్రాదేశిక జలాల్లో ఇద్దరు భారతీయ జాలర్లను ఇటలీకి చెందిన ఇద్దరు నావికాదళ ఉద్యోగులు కాల్చి చంపిన కేసులో ఇటలీ రాయబారిపై భారత సుప్రీంకోర్టు విధించిన ఆంక్షలను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఇవాళ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నామని న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఇటలీకి చెందిన నౌకాదళ అధికారులను భారత్‌కు అప్పగించేందుకు ఇటలీ ప్రభుత్వం నిరాకరించడంతో భారత్‌లోని ఇటలీ రాయబారిపై కోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిపిందే.