ఇది నరమేధం

– 70 ఏళ్ల స్వాతంత్య్రమంటే ఇదేనా?

– ఘటనపై కైలాశ్‌ ధ్వజం

న్యూఢిల్లీ,ఆగష్టు 12(జనంసాక్షి): ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ బీఆర్‌డీ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంపై నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాశ్‌ సత్యార్థిగ్భ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూపీ ప్రభుత్వంపై ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ‘ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరా లేని కారణంగా 63 మంది చిన్నారులు బలయ్యారు. ఇది విషాదం కాదు. నరమేధం. 70ఏళ్ల స్వాత్రంత్యం అంటే మన చిన్నారులకు చెప్పే అర్థం ఇదేనా..?’ అని ప్రశ్నించారు. దీనిపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ జోక్యం చోసుకోవాలని కోరారు.’సీఎం ఆదిత్యనాథ్‌ జీ.. ఈ ఘటనలో విూరు తీసుకునే నిర్ణయం దశాబ్దాలుగా అవినీతిమయమైన వైద్యవ్యవస్థను సరిచేయాలి. అప్పుడే ఇలాంటి ఘటన జరగకుండా ఉంటాయి’ అని సత్యార్థి ట్వీట్‌ చేశారు. /రిళిరఖ్‌పూర్‌లోని బీఆర్‌డీ ఆసుపత్రిలో గత రెండు రోజుల్లో ఆక్సిజన్‌ సరఫరా అందక 30 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం నుంచి మరో ముగ్గురు చిన్నారులు మరణించారు. మరోవైపు ఘటనపై ప్రభుత్వాన్ని విపక్షాలు దుయ్యబట్టాయి. సీఎం ఆదిత్యనాథ్‌ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది.