ఇదొక కుటుంబ వ్యవహారం : గవర్నర్ నరసింహన్

ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు గవర్నర్ నరసింహన్. నిన్న సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన గవర్నర్..మూడు రోజుల పాటు హస్తినాలోనే ఉండనున్నారు. ఇవాళ రాష్ట్రపతి, ప్రధాని మోడీని కలవనున్నారు. ఉదయం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను కలవనున్న నరసింహన్..గవర్నర్ల కమిటీ రిపోర్ట్ ను అందజేయనున్నారు.. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీని సమావేశం కానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులను ప్రధానికి తెలుయజేసే అవకాశం ఉంది. హైకోర్టు విభజనపై కూడా ప్రధానితో చర్చించే చాన్స్ ఉంది. మరోవైపు రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్న గవర్నర్ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలవనున్నారు.