ఇబ్రహీంపట్నం మండల మహిళా సమైక్య 14వ సర్వసభ్య సమావేశం

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జులై  (జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం మండల 14వ సర్వసభ్య సమావేశం సమైక్య మండల అధ్యక్షురాలు అనురాధ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎంపీపీ ఎంపీడీవో క్రాంతి కిరణ్ హాజరు కావడం జరిగింది ముందుగా సమావేశంలో ఎంపీపీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది 2021 2022 సంవత్సరమునకు గాను ఆడిట్ ప్రగతి నివేదిక ఎంపీపీ ప్రారంభించారు సమైక్య మండల అధ్యక్షురాలు కార్యదర్శి ఇ కోశాధికారి వార్షిక ప్రణాళిక రిపోర్టును చదివి వినిపించారు మండల సమైక్య నందు మొత్తం 32 సంఘాలు సభ్యత్వం కలిగి ఉన్నాయని ఉన్నారు మండలంలో మొత్తం 936 సంఘాలు ఉన్నాయి అందులో సభ్యులు 9781 మండలంలోని వికలాంగుల సంఘాలు 25 సభ్యులు 278 మొత్తం మా సమైక్య కు వచ్చిన డబ్బులు 74,54,784 లబ్ధి పొందిన సభ్యులు 8,751, వికలాంగుల సమైక్యకు 12,10,000,  గత సంవత్సరం లో 2021-22 సంవత్సరం లో బ్యాంక్ లింకేజ్ లో లబ్ది పొందిన సంఘాల సంఖ్య718 కి మొత్తం 32,51,28,000 రూపాయలు స్త్రీ నిధి ద్వారా4,99,15,400  రూపాయలు ఇప్పించడం జరిగింది, మొత్తం ఇప్పటివరకు మండల మహిళా సమాఖ్య కార్పన్ 1,67,95,464 గా ఉంది ఈ సందర్భంగా ఎంపీడీవో క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండల మహిళా సమైక్య ప్రగతి స్థానంలో జిల్లా లోని మొదటి స్థానంలో ఉంటుందని మహిళా మణులు అందరికీ రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం 50 శాతం రిజర్వేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని సంఘాల ద్వారా లబ్ధి పొంది సుస్థిరమైన జీవనోపాధిని పొందాలని అన్నారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మహిళను గతంలో ఇంటి గడప దాటాలంటే భయపడేవారు ప్రస్తుతం వారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని మహిళా సంఘాల ప్రారంభంలో ఇరవై రూపాయలతో పొదుపు ప్రారంభించి ఈ రోజుల్లో ఒక్కొక్కరికి పొదుపు రెండు వందల రూపాయలు పొదుపు చేస్తున్నారని తద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న బ్యాంకు లింకేజీ స్త్రీనిధి ద్వారా పొంది వస్తువులు కొనుగోలు చేసి తద్వారా మెరుగైన జీవనోపాధి పొందుతున్నారని అదేవిధంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా కూడా సబ్సిడీ రుణాలు 50 లక్షల వరకు పారిశ్రామికవేత్తలుగా తయారు కావాలని అన్నారు దీనికి తన వంతు కృషి చేస్తానని అన్నారు గ్రామాలలోని మహిళా సంఘాల సభ్యులు ఎలాంటి సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు అనంతరం ఎంపీపీ ఎంపీడీవో లను సమాఖ్య తరఫున సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపిఎం రవీందర్, సిబ్బంది స్త్రీ నిధి మేనేజర్ రవి, మహిళా సమాఖ్య కార్యదర్శి నిర్మల, కోశాధికారి సంధ్య, ఉపాధ్యక్షులు మహేశ్వరి ,సహాయ కార్యదర్శి పారిజాత, వివిధ గ్రామాల సమైక్య అధ్యక్షులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు