ఇల్లెందులో ప్రేమికుల హత్య

ఇల్లెందు: ఖమ్మం జిల్ల ఇల్లెందు సబ్‌ డివిజన్‌లోని గుండాల మండలం మర్కోడు సమీప మామిడితోటలో ప్రేమికుల జంటను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ప్రేమికులను పడిగ రాంబాబు, గొగ్గెల సరళగా గురించారు. రాంబాబు జిల్లాలోని చింతూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.