ఇవేవిూ అసాధారణ ఎన్నికలు కావు: అమిత్‌ షా

భోపాల్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): ఐదు రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికలు.. తమకు అసాధారణ ఎన్నికలు కాదు అని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన బూత్‌ లెవల్‌ కార్యకర్తల సమావేశంలో అమిత్‌ షా పాల్గొని ప్రసంగించారు. 2018 ఎన్నికల్లో గెలుపు 2019 పార్లమెంట్‌ ఎన్నికలకు పునాది లాంటివని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యమని అమిత్‌ షా స్పష్టం చేశారు. మోడీ అభివృద్ది కార్యక్రమాలు మళ్లీ ముందుకు తసీఉకుని వెళతాయన్నారు.