ఇసుక తవ్వకాలపై ముఖ్యమంత్రి సమీక్ష

హైదరాబాద్‌: సచివాలయంలో ఇసుక తవ్వకాలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇసుక విధానంపై ప్రభుత్వం కమిటీ నివేదిక మేరకు నిబంధనలు సవరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇసుక రీచ్‌లకు పర్యావరణ అనుమతలు, నిబంధనలు సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని మంత్రి గల్లా అరుణకుమారి తెలియజేశారు. రాష్ట్రంలో 36 రీచ్‌లకు టెండర్లు పిలిచేందుకు అనుమతలు లభించాయని చెప్పారు.1 రీచ్‌లకు ముందస్తు డిపాజిట్‌గా రూ.1.31 కోట్లు వచ్చాయని ఆమె పేర్కొన్నారు.