: ఈటల రాజేందర్ని విమర్శించే స్థాయి మీకు లేదు

చేవెళ్ల జులై   (జనంసాక్షి)
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గువ్వల బాలరాజ్ పై చేవెళ్ల మండలం బిజెపి ఉపాధ్యక్షులు కృష్ణమోహన్ మండిపడ్డారు. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవని ఈటల రాజేందర్ ను మంత్రిని చేస్తే… తిన్నింటి వాసాలు లెక్కబెట్టి బీజేపీలో బానిసలా బతుకుతున్నాడని సుమన్, బాలరాజు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం కృష్ణమోహన్ వారు మాట్లాడుతూ… ఈటల రాజేందర్‌ సత్తా ఏమిటో హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో చూపించారన్నారు. తెలంగాణ కోసం మొదటి నుంచి పోరాటం చేసిన వ్యక్తి ఈటల అని, తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్‌, కవిత ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.ఉద్యమ సమయంలో ఈటల నీకు చేసిన ఉపకారం ఏమిటో మార్చిపోయావా సుమన్‌ అని నిలదీశారు. ఉద్యమం సమయంలో ఉస్మానియా విద్యార్థులతో పాటు నిన్ను  జైల్‌లో పెట్టిన్నప్పడు నీకు బెయిల్‌ ఇప్పించింది ఎవరో చెప్పగలవా అని సుమన్ ను ప్రశ్నించారు. ఇప్పటికైనా బాల్క సుమన్‌, గువ్వల బాలరాజు తమ స్థాయి ఏమిటో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈటల రాజేందర్ కి క్షమాపణ చెప్పాలని అన్నారు. లేనిపక్షంలో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.