ఈడీ తీరుపై విజయ్ మాల్యా తీవ్ర విమర్శలు

బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడీ కి గట్టి షాక్‌ ఇచ్చాడు. ఆటాచ్‌ మెంట్‌ కు కు ముందే గుట్టుచప్పుడు కాకుండా తన ఆస్తులను మంచి ధరకు అమ్మేసుకున్నాడు. పైగా ఈడీ తీరుపై మాల్యా తీవ్ర విమర్శలు చేశాడు. ఈడీ ఆటాచ్‌ చేసిన ఆస్తులను మాల్యా అమ్ముకున్నట్లు కొంతమంది అధికారులు లీక్ చేశారు. మాల్యా ఆస్తుల స్వాధీనానికి అనుమతినిస్తూ శనివారం కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఉత్తర్వుల కాపీ అందిన వెంటనే వివిధ ప్రాంతాల్లో మాల్యాకు చెందిన 14 వందల 11 కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు ఈడీ ప్రకటించింది. అయితే అంతకుముందే మాల్యా ఈ ఆస్తులను అమ్మేసుకున్నారు.