ఈదురు గాలుల బీభత్సవం

చిన్నచింతకుంట, జనంసాక్షి: నిన్నరాత్రి వీచిన ఈదురు గాలులకు మండలంలో అపార నష్టం ఏర్పడింది. ముచ్చింతలలో 15 విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. చిన్నచింతకుంట, వడ్డేమాన్‌, దమద్‌నాపూర్‌ గ్రామాల్లో మామిడితోటలకు అపార నష్టం ఏర్పడింది. ఆయా గ్రామాల్లో పెద్ద వృక్షాలు నేలకూలాయి.