ఈనెల 18న జరిగే రైతు భరోసా సభను విజయవంతం చేయండి

-బిఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు కేశవ్ రావు
ఇటిక్యాల (జనంసాక్షి) అక్టోబర్ 7 : ఈనెల 18న మానవపాడు మండల కేంద్రంలో జరిగే రైతు భరోసా సభను విజయవంతం చేయాలని బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు కేశవరావు కార్యకర్తలకు సూచించారు. శనివారం ఇటిక్యాల మండల కేంద్రంలోని బహుజన సమాజ్ పార్టీ మండల స్థాయి పోలింగ్ బూత్ కమిటీల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు కేశవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ హోం మంత్రి మహ్మూద్ అలీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ను అందరి ముందు చెంప పై కొట్టడాన్ని బీఎస్పీ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బిఎస్పి పార్టీ అధికారంలోకి రాగానే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీసు వ్యవస్థను చక్కబెడతాడని పోలీసులకు భరోసాను ఇచ్చారు. అనంతరం రైతుభరోసా సభకు సంబంధించిన గోడ పత్రికను బీఎస్పీ పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు తిరుపాల్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రవిచందర్, ఇటిక్యాల మండల అధ్యక్షులు యువరాజ్, తదితర మండల కమిటీ నాయకులు, పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.