ఈవ్‌ టీజింగ్‌తో ఇరువర్గాల ఘర్షణ

లక్నో,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి):ఈవ్‌టీజింగ్‌ కారణంగా రెండు వర్గాల వ్యక్తుల మధ్య ఘర్షణ ఏర్పడిన ఘటన ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో 18 మందికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి

తరలించారు. 17 ఏళ్ల బాలిక రోడ్డుపై వెళుతుంటే కొంతమంది ఆకతాయిలు వచ్చి వేధింపులకు పాల్పడ్డారు. దీంతో బాలిక తరుపు వ్యక్తులు వారితో వాగ్వాదానికి దిగారు. ఇరువర్గాలు వేర్వేరు కులాల వారు కావడంతో ఘర్షణ కాస్త తీవ్రరూపం దాల్చింది. ఓ వర్గం మరో వర్గంవారిపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘర్షణలో 18మందికి గాయాలవగా..చికిత్స అందించామని ఎస్పీ అజయ్‌ సహదేవ్‌ తెలిపారు. రెండు వర్గాలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.