ఈ నామ్ పద్దతి వద్దు
ఆందోళనకు దిగిన టమోటా రైతులు
తిరుపతి,జూలై22(జనంసాక్షి):ఈ-నామ్ పద్ధతి వద్దు అంటూ.. పుంగనూరు తిరుపతి ప్రధాన రహదారి పై
రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ టమాటా మండిలలో రైతుల వద్ద నుండి టమాటాలను కొనుగోలు చేయలేదని ఆగ్రహంతో రైతులు ఎఎంసి కార్యాలయాన్ని ముట్టడించారు. మార్కెట్ యార్డ్ ఆవరణలో రైతులే వ్యాపారస్తులకు టమోటాలు అమ్ముకోవాలంటూ.. ఈ-నాం మార్కెట్ అధికారులు అమలు చేస్తున్నట్లు చెప్పడంతో.. మండి యజమానులు రైతుల వద్ద నుండి టమోటాల కొనుగోలును నిలిపేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు కార్యాలయం ఎదుట, పుంగనూరు తిరుపతి ప్రధాన రహదారి పై ఆందోళన చేపట్టారు. తమకు ఈనామ్ పద్ధతి వద్దంటూ.. మండి యజమానులు తమ వద్ద నుండి టమాటాలను కొనుగోలు చేయాలని రైతులంతా ధర్నా నిర్వహించారు. ఎస్సై అరుణ్ కుమార్ రెడ్డి జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.