ఈ నెల 11 నాటికి నీట్‌పై వాదనలు పూర్తిచేయాలి: సుప్రీంకోర్టు

ఢిల్లీ, జనంసాక్షి: ఈ నెల 11 నాటికి నీట్‌పై వాదనలు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు భారత వైద్య మండలిని ఆదేశించారు. వాదనల తర్వాత అవసరమైతే గడువు పెంపు లేదా మధ్యంతర ఉత్తర్వులపై పరిశీలిస్తామని న్యాయస్థానం పేర్కొంది. ప్రవేశ పరీక్షలకు తుది గడువు సమీపిస్తున్నందున మధ్యంతర ఉత్తర్వులివ్వాలని వైద్యకళాశాలలు, రాష్ట్రాలు సుప్రీంకోర్టును కోరాయి.