ఉక్రెయిన్ నుంచి మరో 160 మంది విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు

 

 

 

 

 

అమరావతి: ఉక్రెయిన్ నుంచి మరో 160 మంది విద్యార్థులు స్వదేశానికి చేరుకున్నారు. భారతీయ పౌరుల తరలింపులో ఏడో రోజు నాడు తెలంగాణకు చెందిన 94 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 66 మంది విద్యార్థులు ఢిల్లీ, ముంబైలలో అడుగుపెట్టారు. ఆయా ప్రాంతాల నుంచి వీరిని తమ గమ్యస్థానాలకు చేరుకొనేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉక్రెయిన్ పొరుగు దేశాలైన బుకారెస్ట్ (రొమేనియా), బుడాపెస్ట్ (హంగేరి), ర్జెస్జో (పోలాండ్), కోసీస్ (స్లోవేకియా), సుసెవా (రొమేనియా) నుంచి 16 విమానాల్లో విద్యార్థులను తరలించారు.